KOODALI

Sunday, April 24, 2011

Living God has passed away


కలియుగం లో కనిపించిన దేవుడు సత్యసాయి వెళ్లి పోయారు. మనవ సేవే మాధవ సేవ అని చేసి చూపించి అసాద్యం అనుకునే దాన్ని సాద్యం చేసి మార్గం చూపి వెళ్లారు. ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. ధనాన్ని ఇంధనముగా చేసి మనుషులంతా ఒక్కటే అని బీదవాని నుండి బిలియనీరు వరకు అందరిని మానవ సేవలో తరింపచేసి పునీతులను చేసారు. వారు భౌతికముగా లేనప్పటికీ మన మనస్సులో ఎప్పటికి ఉండి మనలో ప్రేమ తత్వాన్ని నిద్రలేపుతూ జీవించే ఉంటారు. పూర్తిగా మానవ రూపం దాల్చని కొందరు స్వామి లక్షల కోట్లు సంపాదించాడు అంటూ చేసిన విమర్శలు సరిదిద్దుకుంటారని భావిస్తున్నాను.  స్వామి కూడబెట్టిన సంపద అంతా ఇక్కడే మనకే వదలి వెళ్లారు తనతో ఏమీ తీసుకెళ్ళలేదు. ఇంతకన్నా ఎక్కువ సంపద పరాయి దేశములో దాచిపెట్టిన కుంభకర్ణులను మాత్రం ఎవరు పట్టించుకోరు. హే భగవాన్ ఇప్పటికయినా సదరు మనుషులు కాని మనుషులు  మారి  స్వార్ధం వీడి ప్రేమను పెంచుకొని మానవ సేవకు మరలుతారని కోరుకుంటున్నాను.          


http://www.srisathyasai.org.in/

Wednesday, April 6, 2011

మేరా భారత్ మహాన్

మన భారత దేశం లో ఎన్నో మతాలు, కులాలు, వర్గాలు, జాతులు, భాషలు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయి, ఏ ఒక్క దానికి మరొక దానితో పోసగదు. ప్రతిదానికి ఘర్షణ పడుతూ ఉంటాము. ఎన్నెన్నో రాజకీయాలు చేస్తూ అధికారము కొరకు తన్నుకుంటూ ఉంటారు. ఒక్క తల్లి కి పుట్టిన బిడ్డలు కూడా కలిసి మెలసి ఉండరు. కాని ఒక్కటే ఒక్కటి మాత్ర్హము మన భారతీయులందరిని ఏకం చేస్తుంది. అదే క్రికెట్.  ఈ ఆట విషయానికి వస్తే మేమందరం భారతీయులం, మేర భారత్ మహాన్ అంటూ ఇండియాని కీర్తిస్తూ గెలిచినప్పుడు సంతోషంతో, ఆనందముతో గెంతులు వేస్తాము. ఎవరు ఈ విషయములో విభేధించరు. అందరు కలిసి పండగ చేసుకునేది క్రికెట్ లో గెలిచినప్పుడే. దేశభక్తి పొంగి పొర్లుతుంది. ఇది చూస్తే క్రికెట్ మన దేశభక్తికి చాల ఉపయోగపడుతుంది. ఇండియా ప్రపంచ కప్ గెలిచినప్పుడు ప్రతి వక్కరు తామే గెలిచినట్లు సంబరపడిపోయారు. ఆనందంతో చిందులు వేసి భాణాసంచా కాల్చి పండగ చేసుకున్నారు. దేశప్రజలు అందరు కలిసి చేసుకునే పండగ ఇదేనేమో.  థాంక్స్ తో టీం ఇండియా అండ్ క్రికెట్.